రక్తపరీక్షలో కీలకమైన పరికరం తయారీ
బోస్టన్, జనవరి 11: మలేరియా, హెచ్ఐవీ, క్షయ వ్యాధుల నిర్ధారణకు వైద్యులు రక్త పరీక్షలపై ఆధారపడతారు. ఈ పరీక్షలలో సెంట్రీఫ్యూజ్ అనే పరికరం అత్యంత కీలకమైనది. రోగి నుంచి సేకరించిన రక్తాన్ని పొరలుపొరలుగా విడగొట్టేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ పరికరం ఖరీదు వేలల్లో ఉంటుంది. దీనికి పట్టే సమయమూ ఎక్కువే! ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చు(రూ.14)తో, కేవలం ఒకటిన్నర నిమిషం(తొంభై సెకన్ల)లో ఈ పక్రియను పూర్తిచేసే సరికొత్త సెంట్రీఫ్యూజ్ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. చిన్నపిల్లల ఆటవస్తువు స్ఫూర్తిగా ఈ సెంట్రీఫ్యూజ్ను తయారుచేశారు. స్టాన్ఫోర్డ్ వర్సిటీకి చెందిన ఈ పరిశోధక బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త మనుప్రకాష్ కూడా ఉండడం విశేషం. విద్యుతశ్చక్తి, మరే ఇతర మెషీన్ సాయంలేకుండా చేతులతో అత్యంత వేగంగా తిప్పే వస్తువు తనకు తెలిసి ఇదొక్కటేనని మనుప్రకాష్ తెలిపారు. ఖరీదైన సెంట్రీఫ్యూజ్ కారణంగా రక్తపరీక్షల ఫీజులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తాజా పరికరం అందుబాటులోకి వస్తే రక్త పరీక్షల ఫీజులు తగ్గే అవకాశం ఉంది.
No comments:
Post a Comment